Saturday 25 May 2013

దిక్కులు పిక్కటిల్లిన గానం


తమిళ సినీ నేపధ్య గాయకుడు T.M.సౌందరరాజన్ ఇవ్వాళ మరణించాడు. ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ చూశాను.

నేను సినిమాలు చూసే రోజుల్లో అరవ సినిమాలు (ఇప్పుడంత కాకపోయినా) తెలుగు డబ్బింగులుగా వచ్చేవి. ఎక్కువ సినిమాల్లో శివాజీ గణేశన్, M.G.రామచంద్రన్ లు హీరోలు. వారి నటన అత్యంత తీవ్రంగా ఉండేది. 'కోటీశ్వరుడు' అని ఓ శివాజీ గణేశన్ డబ్బింగ్ సినిమా గుర్తుంది. అందు శివాజీ నటనా బీభత్స విశ్వరూపం గాంచి గజగజలాడితిని.

సినిమాకి హీరో ఎవరైనా సౌందరరాజన్ పాట మాత్రం ఉండేది. నాకు సౌందరరాజన్ పాడుతున్నట్లుగా అనిపించేది కాదు. దిక్కులు పిక్కటిల్లేట్లు పెడబొబ్బలు పెడుతున్నట్లుగా ఉండేది. పొత్తికడుపులోంచి నరాలు బిగబెట్టి.. కడుపులోంచి పేగుల్ని మెలితిప్పుతూ.. ఒంట్లోని రక్తాన్నంతా గొంతులోకి తెచ్చుకుని.. గుడ్లు పగిలేలా, గుండెలు అవిసేలా పాడటం సౌందరరాజన్ స్పెషాలిటీ. వామ్మో! ఏమి హై పిచ్ స్టోన్! ఆయన పాటే ఓ సుడిగాలి, సునామి, భూకంపం, ప్రళయం.

తెలుగులో జయభేరి సినిమాలో చివరిపాట మన సౌందరరాజన్ పాడాడు. వదినగారి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అర్ధిస్తూ (గద్దిస్తూ, గర్జిస్తూ) కాశీనాథశాస్త్రి సౌందరరాజన్ గొంతుతో పాడతాడు. అన్ని పాటలూ పాడిన ఘంటసాల ఈ పాట ఎందుకు పాడలేదు?

అప్పుడు నాకర్ధం కాలేదుగానీ.. ఇప్పుడర్ధమైంది. ఇది పి.పుల్లయ్య దర్శకత్వ ప్రతిభే. ఘంటసాల గొంతైనట్లైతే  మబ్బుల్లోంఛి దూసుకెళ్ళి దేవుడి దాకా చేరేది కాదు. చేరినా ఘంటసాలకి దేవుడు భయపడే వాడు కాదు. సౌందరరాజనా మజాకా! దెబ్బకి దేవుడు దడుచుకుని శాంతకుమారికి ప్రాణం ప్రసాదిస్తాడు. మీ కోసం ఆ పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి. 



(photo courtesy : Google)

No comments:

Post a Comment