కొందరు వ్యక్తులు వయసొచ్చి పరిమాణంలో మాత్రమే పెరుగుతారు. విషయం తెలుసుకోవాలని ప్రయత్నించరు, చెప్పినా అర్ధం చేసుకోరు, పుస్తకం చదివే ఓపిక వుండదు. పూర్తిస్థాయి ఆజ్ఞాని మాత్రమే తన కులం/మతం/ప్రాంతం/భాష/దేశం గొప్పదని విర్రవీగుతాడు.
అందువల్ల - సాధారణంగానే వీళ్లు తమ కులానికి చెందిన రాజకీయ పార్టీనో/సినిమా నటుడినో వెర్రిగా అభిమానిస్తూ బ్రతుకు వెళ్ళమారుస్తుంటారు. ఇలా ఆలోచించే అవసరం లేకుండా బ్రతికేస్తుండటం వల్ల, వీరికి మెదడులో language centers కూడా సరీగ్గా develop అవ్వవు. అందుకే కోపాన్ని వ్యక్తీకరించడానికి బూతుభాషనీ, బెదిరింపుల్నీ ఎంచుకుంటారు.
భారతదేశ ప్రజాస్వామిక విలువల్నీ, భావప్రకటనా స్వేచ్చనీ అర్ధం చేసుకోవడం వీరికి శక్తికి మించిన పని. ఒకప్పుడు ఆధునిక భావజాలంతో కళకళ్లాడిన యువత, నేడు ఆలోచించే శక్తిని కోల్పోయి.. బానిస భావజాలంతో కునారిల్లడం నవీన భారద్దేశంలో ఒక విషాద సమయం.
(ఈ కారణాన, ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతూ తీవ్రంగా దుఃఖిస్తున్నాను)
(fb post)