Friday 25 August 2017

గోరఖ్‌పూర్ విషాదం


మనకి స్వతంత్రం వచ్చి డెబ్భైయ్యేళ్ళైంది, గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో డెబ్భైమంది చిన్నారులు పీల్చుకోడానికి ఆక్సిజన్ లేక మరణించారు. What an irony!

మనం అభివృద్ధి పేరుతో ఎత్తైన బిల్డింగులు కడుతున్నాం, వెడల్పాటి రోడ్లని వేస్తున్నాం, రికార్డ్ నంబర్లో శాటిల్లైట్స్ పైకి పంపిస్తున్నాం.. జబ్బుతో తీసుకుంటున్న పసిపిల్లలకి మాత్రం ఆక్సిజన్ అందేలా మాత్రం చెయ్యలేకపోతున్నాం!

Poor living conditions లో జీవిస్తున్న పేదవారికి దోమలు బంధువులు! అంచేత అవి యెడాపెడా వారిని కుట్టేసి vector borne diseases తెప్పించేస్తయ్, నీళ్ళు కలుషితమై water borne diseases వచ్చేస్తయ్.

మనం public health delivary system ని పటిష్టపరచాలంటే మరిన్ని ఆస్పత్రులు కావాలి.. trained personnel కావాలి.. మందులు కావాలి.. వసతులు కావాలి.. రీసెర్చ్ జరగాలి.. వీటన్నింటికీ నిధులు కావాలి.

అందువల్ల తగినంత నిధులు వెచ్చిస్తూ.. అవి సద్వినియోగం అయ్యెలా పర్వవేక్షణ చేస్తూ.. పరిస్థితి మెరుగయ్యేలా చేసుకోవడం బాధ్యత కల ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని.

కానీ - మన దేశం health budget allocation అభివృద్ధి చెందిన దేశాల్తో పోలిస్తే చాలా చాలా తక్కువ. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల్తో పోల్చినా తక్కువే.

అంచేత - ప్రభుత్వాలు health budget allocation ని తక్షణమే పెంచి, public health delivery system ని మెరుగు పరచాలి. లేకపోతే గోరఖ్ పూర్ సంఘటన పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

కాబట్టి - కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంపై war foot basis న దృష్టి సారించి పరిస్థితుల్ని మెరుగు పర్చాలని కోరుకుంటున్నాను.

(fb post)